Tuesday, May 14, 2024

బెంగళూరులో సిఐడి అధికారిణి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Lady CID officer commits suicide in Karnataka

కర్నాటక: బెంగళూరులో ఒక లేడీ సిఐడి అధికారిణి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను పివి లక్ష్మి (33)గా గుర్తించారు. బుధవారం రాత్రి స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లిన లక్ష్మి ఇంట్లోనే బలవన్మరణానికి ఒడిగట్టారు. 2014 బ్యాచ్ కు చెందిన ఆమె బెంగళూరు డీఎస్పీ ర్యాంక్ అధికారిణిగా నేర పరిశోధన విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. లక్ష్మి, ఆమె భర్తకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. పెళ్లై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేరనే వేదనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News