Sunday, May 5, 2024

భార్యను వేధిస్తున్నాడని.. వ్యక్తిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Man Brutally Murdered in Ongole

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో రెండ్రోజుల క్రితం దారుణహత్య జరిగింది. ఇందుకు సంబంధించిన సిసిటివి దృశ్యాలు విడుదలయ్యాయి. విరాల్లోకి వెళితే… గాంధీ పార్క్ ఎదుట థామస్ అనే వ్యక్తిని జోసెఫ్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. థామస్ గత కొంతకాలంగా ఒంగోలులోని శ్రీకళ దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న మాధురి అనే మహిళను థామస్ కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. థామస్ వేధింపులు శృతిమించిడంతో తన భర్తకు విషయం చెప్పింది. ఈ క్రమంలోనే థామస్ కు జోసెఫ్ రెండు సార్లు వార్నింగ్ ఇచ్చాడు.

అయిన పద్దతి మార్చుకోకపోవడంతో మాట్లాడాలి రమ్మని మాధురి చేత ఫోన్ చేయించాడు. గాంధీ పార్క్ వద్దకు వచ్చిన థామస్ పై అతను కత్తితో దాడి దిగాడు. కూరగాయలు కోసే కత్తితో ఐదో చోట్ల పొడిచాడు. తీవ్రంగా గాయపడిన థామస్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డైయ్యాయి. థామస్ పై దాడి చేసిన తర్వాత భార్యభర్తలు ఇద్దరు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు థామస్ హత్యపై విచారణ జరుపుతున్నారు. ఈ హత్య పార్క్ ఎదుట కలకలం రేపింది. యువకుడిని కత్తితో పొడుస్తున్నప్పటికి స్థానికులు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చివరి నిమిషంలో బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి అడ్డుకున్నా ఫలితం లేకపోయిందని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News