- Advertisement -
ఉప్పల్: హైదరాబాద్ ఉప్పల్ లో గురువారం మధ్యాహ్నం గంజాయి పట్టుబడింది. ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ నర్సీపట్నం నుంచి హైదరాబాద్ కి గంజాయి తరలిస్తూ దొరికాడు. మోహన్ కృష్ణపై అనంతపురం టౌన్ లో మరో కేసు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ అధికారులు సిఐ శ్రీరామ్ డ్రైవర్ కి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ ను కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితుడు లాక్ డౌన్ సమయంలో చెక్ పోస్టుల దగ్గర డ్యూటీ చేస్తూ గంజాయి సప్లైదారులతో పరిచయం పెంచుకున్నట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
Cannabis Seized in Hyderabad
- Advertisement -