Saturday, April 27, 2024

లక్ష్మీనరసింహ స్వామి సేవలో గవర్నర్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దర్శించుకున్నారు.  ఆమెకు కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం కొండపై ఆలయం వద్ద ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభు ఆలయంలోకి వెళ్లిన గవర్నర్.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అందరికీ బెస్ట్ విషెస్ అంటూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కామెంట్ చేశారు. ఇక, ఈరోజు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News