Sunday, May 5, 2024

కొవిడ్19పై పోరాటానికి లతా మంగేష్కర్ విరాళం

- Advertisement -
- Advertisement -

ముంబయి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా ప్రముఖ సినీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ రూ.7 లక్షల విరాళాన్ని మహరాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేశారు. ఈవిషయాన్ని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల డైరెక్టరేట్ జనరల్ శనివారం ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. కరోనాపై పోరాటానికి తన వంతు సాయంగా రూ.7 లక్షల విరాళాన్ని సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందచేసినందుకు లతా మంగేష్కర్‌కు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కృతజ్ఞతలు తెలియచేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ట్వీట్ చేసింది. కొవిడ్-19పై పోరాటానికి తోడ్పడవలసిందిగా ముఖ్యమంత్రి థాక్రే ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ప్రముఖ నటి, నిర్మాత ప్రియాంక చోప్రా కరోనా విపత్తు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందచేశారు.

Lata Mangeshkar donate rs 7 lakh to Maha CMRF for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News