Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన లయ, ప్రియ

- Advertisement -
- Advertisement -

Laya priya plant trees in green india challenge

మేడ్చల్: రాజ్యసభ సభ్యులు ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రిన్స్ లయ..ప్రియ పాల్గొని ఉప్పల్ మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో మొక్కలు నాటారు.  ప్రిన్స్ లయ..ప్రియ తమ పుట్టిన రోజు సందర్భంగా గత మూడు సంవత్సరాల నుండి ప్రతి పుట్టిన రోజున మూడు మొక్కలు నాటుతున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ప్రకృతి తల్లికి అలాగే ఎంపి సంతోష్ కుమార్ అంకుల్ కు వందనాలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతి పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నామని వివరించారు. ఇలానే ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నటి నెేల తల్లిని కాపాడాలని లయ, ప్రియ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News