Friday, April 26, 2024

వాహనం ఢీకొని చిరుత మృతి

- Advertisement -
- Advertisement -

Leopard dead in road accident in Kama Reddy

 

సదాశివనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 44వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల చిరుత కళేబరాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి పంపించారు. చిరుత వయస్సు రెండేళ్ల లోపు ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News