Friday, May 3, 2024

‘మా’ ఎలక్షన్: పోలీంగ్ కేంద్రానికి చేరుకున్న చిరు, బాలయ్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసో‌సి‌యే‌షన్‌(మా) ఎన్ని‌క‌ల పోలింగ్‌ ప్రారంభయింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు తమ ఓట్ ను వినియోగించుకునేందుకు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటిక్రితమ మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, రామ్ చరణ్, మంచు లక్ష్మీ, మనోజ్ తదితరులు పోలీంగ్ కేంద్రానికి చేరుకున్నాయి. అంతకుముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన ఓటు వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. రాత్రి 8 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణుల ప్యానల్స్ మధ్య మాటల యుద్ధం ఈరోజుతో ముగియనుంది.

 

MAA Elections: Chiranjeevi and Balayya reached at polling Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News