Sunday, April 28, 2024

పిచ్చెక్కించే హాస్యం ఉన్న ‘మ్యాడ్’

- Advertisement -
- Advertisement -

యువ నటీనటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీగౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్‌ల కామెడీ ఎంటర్‌టైనర్ ’మ్యాడ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్ర ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. వినోదంతో నిండిన ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పిన ఎన్టీఆర్.. మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఒక హాస్యభరితమైన కథ ఉందని నాగ వంశీ నన్ను సంప్రదించారు. కేవలం ఐదు నిమిషాల కథలోనే కాలేజీ వైబ్, కామెడీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాలీవుడ్‌లో ఇలాంటి కథ వచ్చి చాలా సంవత్సరాలైంది.

ప్రేక్షకులను పిచ్చెక్కించే హాస్యం ఉన్నందున ఈ చిత్రానికి మ్యాడ్ అని పేరు పెట్టాము”అని అన్నారు. రామ్ నితిన్ మాట్లాడుతూ ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నుండి ఆఫర్ రావడం, స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చేశానని చెప్పారు. గోపికా ఉద్యన్ మాట్లాడుతూ “తెలుగులో మ్యాడ్ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాను. సినిమాలో నేను రాధ అనే కీలక పాత్ర పోషించాను”అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News