- Advertisement -
ముంబై : లాక్డౌన్ కారణంగా నాందేడ్ తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ వద్ద నిల్చిపోయిన మొదటి బ్యాచ్ వంద సిక్కు యాత్రికులను వారి స్వంత రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీకి శనివారం పంపించిన తరువాత మిగతా రాష్ట్రాలు కూడా చొరవ తీసుకోవాలని మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ అజొయ్ మెహతా శనివారం సూచించారు. ఉత్తర ప్రదేశ్ బీహార్,రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్గడ్, రాష్ట్రాలు నుంచి వచ్చి మహారాష్ట్రలో చిక్కుకు పోయిన 3.5 లక్షల వలసవాదులను ఆయా రాష్ట్రాలు తరలించుకు వెళ్లాలని ఆయన కోరారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల వరకు వీరిని చేర్చి అప్పగించడానికి మహారాష్ట్ర ఒప్పుకుంటుందని ఆయన అన్నారు.
Maharashtra instructs six states to move colonists
- Advertisement -