Friday, May 3, 2024

‘మహా సముద్రం’ ట్రెండ్ సెట్టర్ సినిమా

- Advertisement -
- Advertisement -

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర్కెక్కిస్తున్నారు. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా ఈనెల 14న ఈ సినిమా రానుంది. ఈ సందర్భంగా హీరో సిద్దార్థ్ మీడియాతో మాట్లాడుతూ “అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన్ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాను నేను చూశాను. ఎంత పర్‌ఫెక్షన్‌తో తీశాడో అందరికీ తెలిసిందే.

అలాంటి దర్శకుడు వచ్చి రెండో సినిమా కథ చెప్పాడు. అజయ్ భూపతి ‘మహాసముద్రం’ కథ చెబుతుంటే.. రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా. శర్వానంద్ అద్భుతమైన నటుడు. నేను, శర్వాతో ఒక్కసారి కూడా ఈ సినిమా గురించి చర్చించలేదు. మాకు స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఉంది. మనం తీసుకున్న నిర్ణయాల వల్లే పరిస్థితులు ఏర్పడతాయి. మంచి మనిషా? చెడ్డ మనిషా? అనేది వారు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఇందులో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. మహా అనేది హీరోయిన్ పేరు. అది ఎవరు? అన్నది సినిమాలో తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా షూర్ షాట్ బ్లాక్‌బస్టర్. నాకు ఇది కమ్‌బ్యాక్ సినిమా అవుతుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News