- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : మహావీర్ జయంతి సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ రాష్ట్రంలోని జైన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్భవన్లో మహావీర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. మహావీర్ అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక నాయకుల్లో ఒకరని, అతని జీవితం నిజం, అహింస, కాఠిన్యం మీద ఆధారపడి ఉందని, అతను ఎల్లప్పుడూ అందరికీ ప్రేరణగా నిలిచారని ఆమె కొనియాడారు.
పిఎం కేర్స్కు గవర్నర్ రూ.5లక్షల విరాళం
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రూ. 5,00,000 (ఐదు లక్షలను) సోమవారం పిఎం కేర్స్ (PM CARES) నిధికి అందచేశారు. ప్రతి నెలా ఎమోల్యూమెంట్లలో (వేతనంలో) 30 శాతం జీతాన్ని దేశంలో సాధారణ స్థితి పునరుద్ధరించబడే వరకు నెలకు 1,05,000 (రూపాయి లక్షా ఐదు వేలను) పిఎం కేర్స్ (PM CARES) నిధికి అందిస్తామని గవర్నర్ పేర్కొన్నారు.
Mahaveer’s life is an inspiration to all
- Advertisement -