Monday, April 29, 2024

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ ( ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయినట్టుగా రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొంత కాలంగా తమిళిసై సౌందర రాజన్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో తమకు తెలియకుండానే పోస్టులు రావడంపై రాజ్ భవన్ వర్గాలు ఆరా తీశాయి. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్ భవన్ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఎక్స్ ఖాతాను ఓపెన్ చేసిన సమయంలో తప్పుడు పాస్‌వర్డ్ అంటూ సూచించేది.

మరో వైపు ఈ ఖాతాలో తాము పోస్టు చేయని అంశాలను కూడ సిబ్బంది గుర్తించారు. దీంతో ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైందని గుర్తించారు. గతంలో కూడ పలువురు అధికారులు,రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కు గురయ్యాయి. ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ హ్యాక్ కు గురైంది. గతంలో ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ సోషల్ మీడియా ఖాతా కూడ హ్యాక్ కు గురైంది. మాజీ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ఖాతా కూడ హ్యాక్‌కు గురైన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News