ఢాకా: బంగ్లాదేశ్ టి -20 ఇంటర్నేషనల్ కెప్టెన్ మహముదుల్లాకు కరోనా వైరస్ సోకింది. పాజిటివ్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ప్లేఆఫ్స్కు దూరం కానున్నాడు. 34 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఆదివారం రాత్రి దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంది. పాక్ కు వెళ్లే ముందు కోవిడ్ పరీక్షలు చేయగా.. ఫలితాల్లో పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. ”జలుబు మినహాయించి నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అయినా పాజిటివ్ రావడం దురదృష్టకరం. త్వరలో బంగ్లాలో జరిగే టి20 కప్ కు అందుబాటులో ఉంటాను” అని మహ్మదుల్లా తెలిపాడు. 2020 పిఎస్ఎల్, ప్లేఆఫ్లు నవంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మహముదుల్లా ఇప్పటివరకు బంగ్లాదేశ్ తరపున 49 టెస్టులు, 188 వన్డేలు, 87 టి 20ఐలు ఆడారు. అతను 150 వికెట్లు తీయడంతో పాటు 8,000 అంతర్జాతీయ పరుగులు చేశాడు.
బంగ్లా కెప్టెన్ కు కరోనా పాజిటివ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -