- Advertisement -
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్లో పెను విషాదం నెలకొంది. జట్టులో చోటు దక్కలేదనే మనస్తాపంతో ఓ యువ క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బంగాబంధు టి20 టోర్నమెంట్లో చోటు దక్కక పోవడంతో తీవ్ర నిరాశకు గురైన బంగ్లాదేశ్ అండర్19 మాజీ క్రికెటర్ మహ్మద్ సోజిబ్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్షాహిలోని తన నివాసంలో సోబిజ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక పోలీస్ అధికారి హస్మత్ అలీ తెలిపారు. సోజిబ్కు క్రికెట్ అంటే ప్రాణమని అయితే జట్టు ఎంపికలో అతనికి చోటు లభించక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు సోజిబ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
- Advertisement -