Saturday, May 11, 2024

విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.10లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నా రు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఒమర్ బిన్ ఇలియాస్ జుంబాలి జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. వచ్చే డబ్బులు తన అవసరాలకు తీరకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ డబ్బులతో కుటుంబ అవసరాలు తీరడంలేదు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు.

కిరణా షా పులో విదేశీ సిగరెట్లను విక్రయించాలని ప్లాన్ వేశాడు. వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ వి షయం పోలీసులకు తెలియడంతో పోలీసులు దాడి చేసి విదేశీ సిగరేట్ల ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం చాంద్రాయణగుట్ట పో లీసులకు అ ప్పగించారు. ఇన్‌స్పెక్టర్ అజయ్‌కుమార్, ఎస్సైలు నవీన్, నర్సింహులు, ఆంజనేయులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News