Wednesday, May 8, 2024

చెరువులో పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/వెల్దుర్తి: చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని దేవతల చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం… వెల్దుర్తి మండలంలోని దేవతల చెరువు అలుగు గట్టుపై ఓ కవర్‌లో బట్టలు, సెల్‌ఫోన్, బైక్‌ను గుర్తించిన గ్రామ సేవకులు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. సంఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు చెరువులో గాలించగా యవకుడి మృతి దేహం లభ్యమైందన్నారు. మృతుడు శివంపేట మండలంలోని పాంబండ గ్రామానికి చెందిన దుర్గప్రసాద్(27) గుర్తించి  కుటుంబ సభ్యులకు సమాచారం అందించమన్నారు. సంఘటన స్థలానికి చెరుకున్న కుటుంబ సభ్యులు చెరుకొని మృతి దేహం దుర్గప్రసాద్ గా నిర్థారించారు కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. దుర్గప్రసాద్ నాలుగు రోజుల క్రితం శివమాల ధరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విక్రాంతి, ఒక సంవత్సరం కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News