- Advertisement -
కార్వాన్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధి పాత మల్లేపల్లి ప్రాంతానికి చెందిన కె.మురళి (40)కి సుమారు 7 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నాడు. ఈ నెల 12న సాయంత్రం 6 గంటల సమయంలో మురళి భార్య కృష్ణవేణి మొబైల్ ఫోన్ రిపేర్ చేయించడానికి బయటకు వెళ్లి తిరిగి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంట్లో చూడగా భర్త కనిపించకపోవడంతో తెలిసిన, బంధువుల ఇంటికి వెళ్లి వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో మంగళ్హాట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివానందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -