ఔరంగాబాద్: నిద్రపోనివ్వడం లేదని 13 రోజుల చిన్నారిని మేనమామ డ్రమ్ములో ముంచి చంపేసిన దారుణ సంఘటన మహారాష్ర్ట లాతూర్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెలితే… లాతూర్ జిల్లా బుద్రుక్ గ్రామానికి చెందిన కృష్ణ షిండే సోదరి డెలివరీ కోసమని తల్లిగారింటికి వచ్చింది. 15 రోజుల క్రితం ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. కాగా పాప తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెందిన పంతొమ్మిదేళ్ల మేనమామ కృష్ణ, చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పేడేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కృష్ణ షిండేను అరెస్టు చేసి, విచారించగా పాప తరచూ ఏడుస్తుండడంతో తనే నీటిలో ముంచి చంపేశానని నేరం అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Man held for drowning his infant niece in water drum