Tuesday, May 14, 2024

దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకిన వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి దూకిన వ్యక్తి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఛత్తీస్‌గడ్‌కు చెందిన భీమా (45) అనే కూలీ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడికి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో రోడ్లపై తిరుగుతున్నాడు. గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మొదటి అంతస్థు నుంచి  కిందకు దూకాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News