Saturday, September 21, 2024

మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి టాటానగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం టాటానగర్ లోని ఓ పరుపుల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News