Tuesday, April 30, 2024

ఎంపి రంజిత్‌రెడ్డిని కలిసిన మేయర్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

Mayor Vijayalakshmi meets MP Ranjith Reddy

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావులు ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మేయర్ విజయలక్ష్మి తన తండ్రి కె.కేశవరావుతో కలిసి ఎంపి రంజిత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపి మేయర్‌కు పూలబొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంఆయన కాసేపు కెకెతో సమావేశమైయ్యారు.

Mayor Vijayalakshmi meets MP Ranjith Reddy
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి

మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదివారం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మేయర్‌కు అమ్మవారి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలను అంద జేశారు. సోమవారం మేయర్‌గా బాధ్యత స్వీకరించనుండడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.

Mayor Vijayalakshmi meets MP Ranjith Reddy

 

Mayor Vijayalakshmi meets MP Ranjith Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News