Friday, May 3, 2024

కర్నూల్‌లో మెడికో ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. విశ్వభారతి మెడికల్ కాలేజ్‌లో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతున్న లోకేశ్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News