Saturday, May 11, 2024

మంత్రి , జడ్‌పి చైర్మన్ వాగ్యుద్ధం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరిలో ఉద్రిక్తత

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జి ల్లా బీబీనగర్ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనా న్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్‌పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య వా గ్వాదం జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమావేశంలో ముం దుగా జడ్‌పి చైర్మన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకు న్నారు. నాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాల ను ప్రారంభించడం కాకుండా ఆ పార్టీపై బురద జల్లడం సరికాదని సం దీప్ రెడ్డి అన్నారు. రైతుబంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలనడం మంచి పద్ధతి కాదని సూచించారు.

ఇలా జడ్‌పి చైర్మన్ మాట్లాడుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఒక గొప్ప మహా నాయకుడు.. ఆయన కడుపులో పుట్టిన ఎలిమినేటి సందీప్ రెడ్డి ఒక బచ్చా అని వ్యాఖ్యానించారు. తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ఈరోజు జడ్‌పి చైర్మన్ పదవిపై సందీప్ రెడ్డి కూర్చున్నాడే తప్ప కనీసం వార్డ్ మెంబర్ గెలిచే స్థాయిలో కూడా ఆయన లేడని వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు సుకుంది. ఇంతలోనే కార్యకర్తలు జడ్‌పి చైర్మన్ తీరుపై మండిపడ్డారు. పోలీసులు వెంటనే స్టేజీపైకి వచ్చి సందీప్ రెడ్డిని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News