Tuesday, May 7, 2024

రాష్ట్రానికి మంత్రి అయినా… రైతుకు బిడ్డే..

- Advertisement -
- Advertisement -

 

రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురుస్తాడు…వ్యవసాయం చూస్తే ఉరకలేస్తాడు…తోటోళ్లు పొలం పనులు చేస్తుంటే తను ఆగలేడు.తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే పొలంలోకి దూకి… గొర్రు పట్టి ఎడ్లను సై అన్నారు.అందరితో కలిసి..గొంతు కలిపి నాట్లు వేశారు. దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ గారు పండగ చేస్తే…ఆ వ్యవసాయాన్ని మంత్రులు కూడా పొలంలోకి దిగి బురద గొర్రు కొడుతున్నారు. మా నాయకుని ఆశయ సాధనలో అడుగులు వేస్తామని అనడమే కాకుండా నేరుగా వ్యవసాయం చేశారు. రైతు రాజు అయితే… రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నామన్నారు. గతంలో నెర్రెలు పారిన పొలాలు..స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని ఆయన పేర్కొన్నారు. అపర భగీరధుడు కేసీఆర్ అని ఆయన ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే… చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే.. రైతులు పొలాల్లో వ్యవసాయం చేస్తుంటే…ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News