Saturday, April 27, 2024

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు.

ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. వెంట ఏమైనా డబ్బు ఉందా? ఎంత ఉంది? అంటూ ఆరా తీశారు. తమ వాహనం మొత్తం, వెంట ఉండి మరీ, పోలీసులకు చూపించారు. వాహన తనిఖీ అనంతరం మంత్రికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News