Saturday, May 11, 2024

మీ అప్పుల సంగతేంది?

- Advertisement -
- Advertisement -

మోడీ వచ్చాక కేంద్రం అప్పులు రూ.100 లక్షల కోట్లకు పెరిగాయి

డబుల్ ఇంజిన్లు కాదు.. డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వం కావాలి

దేశంలో ప్రతి వ్యక్తిపై
రూ.1.25లక్షల అప్పు పెట్టారు
జాతీయ తలసరి ఆదాయంతో
పోలిస్తే తెలంగాణ తలసరి
ఆదాయం రెండింతలు
అప్పుల నిష్పత్తిలో అట్టడుగున
తెలంగాణ కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు
మంత్రి కెటిఆర్ కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి అవసరమైనవి పాడైపోయిన డబు ల్ ఇంజిన్లు కావని, డబుల్ ఇంపాక్ట్ (రెండింతలు పనితీరు చూపే) ప్రభుత్వమని టిఆర్‌ఎస్ కార్యనిర్యాహక అ ధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేం ద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను తప్పుపట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. అందులో తాను పేర్కొన్న అం శాలను కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని సూచించారు. ఆర్థిక అంశాల్లో నిపుణురాలైన నిర్మలా సీతారామన్ తాను చెబుతున్న అంశాలను కూడా ప్రసంగాల్లో ప్రస్తావించాలన్నారు. 67 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో 2014 ముందు వరకు 14 మంది ప్రధానులు మారారని, అప్పటికి దేశ అప్పు రూ. 56 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక గత ఎనిమిదేళ్లలో అప్పు రూ.100 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు.

దీనివల్ల దేశంలో ప్రతి ఒక్కరిపై అప్పు రూ.1.25 లక్షలకు చేరిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు కాగా, జాతీ య తలసరి ఆదాయం కేవలం రూ. 1.49 లక్షలేనని గుర్తుచేశారు. జిఎస్‌డిపిలో అప్పు ల నిష్పత్తిని చూస్తే తెలంగాణ చాలా మెరు గ్గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ జీఎస్‌డిపి, అప్పుల నిష్పత్తి 23.5 శాతమేనని, దేశంలోని 28 రాష్ట్రాల్లో 23వ స్థా నంలో ఉందని వివరించారు. అదే దేశ అప్పులు, జీడీపీ నిష్పత్తి 59 శాతమని గుర్తు చేశారు. అంటే తెలంగాణ అప్పులే తక్కువని స్పష్టం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అంత మెరుగ్గా పనిచేస్తే భారతదేశం 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎదిగి ఉండేదని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News