Sunday, April 28, 2024

‘దారి చూపిన దశాబ్ది’ సంకలనాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, మళ్లీ తెలంగాణదే ఘన విజయమని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వ్యాసాల సంకలనం “దారి చూపిన దశాబ్ది” పుస్తకాన్ని మంత్రి కెటిఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు.

ఈ సంధర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పదేళ్ల రాష్ట్ర ప్రగతిపథం దేశ పాలనా చరిత్రలో నూతన అధ్యాయమని వ్యాఖ్యానించారు. సాగు, సంక్షేమ, పారిశ్రామిక రంగాల్లో సిఎం కెసిఆర్ అమలు చేసిన విధానాలు అధ్భుతమైన ఫలితాలను ఇచ్చాయని అన్నారు. దేశంలో ఒకటో, రెండో రంగాల్లో మిశ్రమ ఫలితాలకే క్షీర విప్లవం, హరిత విప్లవమని కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు డబ్బా కొట్టుకున్నాయని, కానీ అన్ని రంగాల్లో మన తెలంగాణ రాష్ట్రం సాధించిన పదేళ్ల ప్రగతి విప్లవాన్ని బుధ్ధి జీవులు ఎంత ప్రజల్లో భావవ్యాప్తి చేయాలో అర్థం చేసుకొని, భాధ్యత తీసుకోవాలని కోరారు.

తన వ్యాసాల ద్వారా తెలంగాణ రాష్ట్ర పురోగతిని ఎత్తి పట్టడంతో పాటు బిజెపి, కాంగ్రెస్‌ల అమానవీయ రాజకీయ నైజాన్ని బహిర్గతం చేస్తున్న ఆంజనేయ గౌడ్ కృషి ప్రశంషనీయని కెటిఆర్ అన్నారు. ఆలోచనాపరులు కీలకమైన ఎన్నికల సందర్భంగా క్రియాశీల పాత్ర పోషించి బిఆర్‌ఎస్ గెలుపులో భావవ్యాప్తికి సారధ్యం వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఆంజనేయ గౌడ్ సారధ్యంలో పాలమూరు గాయకుడు రేలారే ప్రసాద్ రచించి, ఆలాపించిన ‘గుండెకత్తుకుందమా..గులాబీ జెండాను’ పాటను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి రవీందర్ రావు, మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్, తెలంగాణ గాయకుడు తదితరులు పాల్గొన్నారు.

book release 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News