Wednesday, May 1, 2024

యుకెలో రెండవ రోజు కెటిఆర్ బిజిబిజి

- Advertisement -
- Advertisement -

Minister KTR London tour

పలు కంపెనీల ప్రతినిధులతో సుధీర్ఘ సమావేశం
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించిన మంత్రి
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు కంపెనీల ఆసక్తి

హైదరాబాద్ : యుకె పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ రెండవ రోజుకు పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి కెటిఆర్ సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయిగా భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేశారు. అలాగే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అవసరమైన సహాయ, సహకారాలను సంపూర్ణంగా అందిస్తామన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్..ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లో కంపెనీకు అవసరమైన అన్ని రకాల అనుమతులను జారీ చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఇందుకు పలు కంపెనీలు ఫిదా అయ్యాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సముఖతను వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వారు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.

వారిలో ప్రధానంగా ప్రధానంగా థామస్ లాయిడ్ గ్రూప్ ఎండి నందిత సెహగల్ తుల్లీతో పాటుసీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కెటిఆర్‌తో సుధీర్ఘంగా చర్చించారు. అలాగే పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన కెటిఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్‌తో పని చేసేందుకు రియల్ సంస్థ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ వారిని తెలంగాణకి ఆహ్వానించారు. క్రాన్ ఫీల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్ లు మంత్రి కెటిఆర్‌తో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి ఎరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని ఈ సందర్భంగా కెటిఆర్ క్రాన్ ఫీల్ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఎస్‌బిసికి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్ లు మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే తమకు బలమైన ప్రెజెన్స్ ఉన్నదని తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News