Sunday, April 28, 2024

నేడు బిఆర్‌ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో నేడు సాయంత్రం 5 గంటలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు బిఆర్‌ఎస్ ఎన్నారై శాఖ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ 2018లో బిఆర్‌ఎస్ తరఫున విస్తృతంగా ఎన్నారైలు ప్రచారాన్ని నిర్వహించారని, అలాగే ఈసారి కూడా ఈ ఎన్నికల్లో అటు సోషల్ మీడియా కాంపెయిన్‌తో పాటు ప్రత్యక్షంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నారైలు పర్యటించి కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతారని, రాబోయే ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలన్న దానిపై దిశా నిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News