Sunday, April 28, 2024

23న మేడారంకు సిఎం రేవంత్ రెడ్డి రాక

- Advertisement -
- Advertisement -

తాడ్వాయి : మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైందని, ప్రభుత్వం తరఫున సకల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా అధికారులతో కలిసి దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అనంతరం మాట్లాడుతూ మేడారం జాతర కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలని ఆదేశించారు. జాతరకు వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుంది అని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్, రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

భక్తులు ఇబ్బంది పడకుండా తల్లులను దర్శించుకోవడానికి క్యు లైన్ల సంఖ్యను పెంచడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ కుంభమేళా అయిన మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగిందని ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుండగా ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క, సారక్కల జాతర నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళా*మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యడం జరిగిందని ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో మరో పది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. అధికారులు జంపన్నవాగు పై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ, డిపిఓ వెంకయ్య, పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పస్రా సిఐ వి శంకర్, తాడ్వాయి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి ఆలయ ఈవో రాజేందర్ లతో పాటు జిల్లా అధికారులు పూజారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News