Sunday, April 28, 2024

గాంధీభవన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన మైనార్టీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాతో ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే మైనార్టీ నాయకులు గాంధీభవన్ కు పెద్దఎత్తున చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాతబస్తీ నియోజకవర్గంలోని టికెట్లను సంబంధం లేని వారికి ఇచ్చారని మైనార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే మల్లు రవి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని వారు అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక మల్లురవి గాంధీ భవన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయినప్పటికీ గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మైనార్టీ నాయకులు అక్కడే ఆందోళన చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News