Sunday, April 28, 2024

లాల్‌దర్వాజా బోనాలకు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి బోనాల జాతరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ ఆహ్వానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలుసుకొని ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈనెల 16వ తేదీ ఆదివారం జరిగే బోనాల పండగ రోజున హాజరై సింహవాహిణి దర్శించుకోవాలని కోరారు. అందుకు ఆమె అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్, మాజీ చైర్మన్లు పి.విజయ్ కుమార్, జె.లక్ష్మీనారాయణ, కె.వెంకటేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News