Tuesday, May 14, 2024

సమాజ రూపురేఖలు మార్చే శక్తి యువతకే ఉంది: మోడీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: మన వర్సిటీలు ప్రపంచ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. విద్యాప్రమాణాలు పెంచుకుని మంచి ర్యాంకుల్లో నిలుస్తున్నాయని కొనియాడారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్ని ప్రసంగించారు. నేడు ప్రతి రంగం ఆవిష్కరణలు కోరుకుంటోందని, యువత అంటేనే సమాజ రూపురేఖలు మార్చే శక్తి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. వర్సిటీల నుంచి వచ్చే యువత సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. దేశంలోని విమానాశ్రయాలను పదేళ్లలో రెట్టింపు చేశామని, దేశంలోని 74 విమానాశ్రయాలను పదేళ్లలో 150కు పెంచామని మోడీ స్పష్టం చేశారు. ప్రధాన పోర్టుల్లో కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం రెండింతలు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News