Thursday, May 2, 2024

తెలంగాణను అభినందించిన మోడీ

- Advertisement -
- Advertisement -

ఎన్‌హెచ్ 161లో నాలుగు లేనింగ్‌లో మంచి పురోగతి సాధించిన ప్రశంసలు

Modi congratulation Telangana state

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలను కురిపించారు. బుధవారం ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లోని వివిధ రైల్వే ప్రాజెక్టులు , హైవే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజనలో సాధించిన పురోగతిని సమీక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్-161లోని సంగారెడ్డి…అకోలా..- నాందేడ్ సెక్షన్ లోని నాలుగు లేనింగ్ విషయంలో సాధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. భూసేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పురోగతి సాధించిందని కేంద్ర రవాణా కార్యదర్శి ఎ.గిరిధర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ , ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ సంచాలకులు డా.ప్రీతి మీనాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News