Saturday, April 27, 2024

మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలి

- Advertisement -
- Advertisement -

మొక్కలు నాటిన సిరిసిల్ల ఎస్‌పి రాహుల్ హెగ్డే

SP plant tree in Green India challenge

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బుల్లితెర నటుడు ప్రియతమ్ కోరారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో భాగంగా నటుడు సిద్దువిసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ బుధవారం జూబ్లీహిల్స్‌లో ప్రియతమ్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌తో ప్రకృతి పచ్చబడుతుందన్నారు. అనంతరం నటులు రాజ్‌కుమార్, హర్షిత వెంకటేష్, శ్యామ్‌లకు ఆయన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా రాజన్నసిరిసిల్లా జిల్లా ఎస్‌పి రాహుల్ హెగ్డే గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. తరిగిన ప్రకృతి శాతాన్ని గ్రీన్‌ఇండియా ద్వారా పొందుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News