Friday, April 26, 2024

కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల రద్దీ పెరిగింది. కొండగట్టుకు దీక్షాపరులు, భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ్టి నుంచి కొండగట్టులో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది. కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు శాంతి సౌభాగ్యలతో ఉండాలని చాలీసా పారాయణం చేపడుతున్నారని ఎంఎల్‌సి కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంఎల్‌సి కవిత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News