Tuesday, April 30, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లీ, కొడుకు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

యాచారం: గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లి కొడుకులు మృతి చెందిన ఘటన యాచారం మండలంలోని చౌదర్పల్లి గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సిఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కర్నాటి నరసమ్మ56, ఆమె కుమారుడు కర్నాటి యాదయ్య36 మోటారు సైకిల్ పై ఇబ్రహీంపట్నం నుండి తమ గ్రామానికి వస్తుండగా మాల్ నుండి హైదరాబాద్ వెళుతున్న గుర్తు తెలియని వాహనం

ఢీకొనడంతో బైక్ పై కూర్చున్న నరసమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆమె కుమారుడు యాదయ్య 36 తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.తల్లి కొడుకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషయాలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తునట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News