Sunday, April 28, 2024

ప్రేమాయణం… గర్భం దాల్చడంతో మేనత్త-అల్లుడు నదిలో దూకి…

- Advertisement -
- Advertisement -

భోపాల్: మేనత్తతో మేనల్లుడు ప్రేమాయణం కొనసాగించాడు.. దీంతో మేనత్త గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మేనత్తతో కలిసి మేనల్లుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సిహావల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేనత్త, మేనల్లుడు ఒకే గ్రామంలో ఉండడంతో ఇద్దరు మధ్య పరిచయం ఉంది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. మేనత్త గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులకు మేనల్లుడు చెప్పాడు. కానీ అతడి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. సోన్ నది వంతెన పైనుంచి ఇద్దరు నీళ్లలోకి దూకారు. ఇసుక తిన్నెలపై ప్రేమ జంట మృతదేహాలు కనిపించడంతో స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News