Friday, April 26, 2024

కీచక తల్లి అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: మాతృత్వానికి మచ్చ తెచ్చే సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కన్నబిడ్డనే ఓ తల్లి తీవ్రంగా కొట్టి చిత్రహింసలు గురిచేసింది. దీంతో రెండేళ్ళ బాలుడు విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్ చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని ఏడు ఏళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. వీరికి గోకుల్(4) ప్రదీప్(2) అనే పిల్లలు ఉన్నారు. ప్రియుడిని కలిసేందుకు ప్రదీప్ అడ్డుగా ఉన్నాడనే తులసి ఇలా చేసిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి, చిత్తూరు జిల్లాలో ఉన్న తల్లి తులసి కోసం ప్రత్యేకంగా పోలీసు టిమ్ లను పంపించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం రాంపల్లెలో నిందితురాలను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Tamil Nadu Woman Arrested for torturing her Son

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News