Tuesday, April 30, 2024

వర్షంలోనూ వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

వేములవాడ: కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు, వేములవాడ పట్టణంలో భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, సోమవారం తెల్లవారుజాము నుంచే పట్టణంతోపాటు, వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది.

Huge Devotees visit Vemulawada Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News