ఛండీగఢ్: తనయుడు తన కంటే నానమ్మతో ప్రేమగా ఉంటున్నాడనే అసూయతో ఓ కోడలు తన కుమారుడిని చంపి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పంజాబ్లోని జలంధర్ ప్రాంతం షాకోట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుల్విందర్ కౌర్ అనే మహిళ భర్త ఇటలీ ఉండడంతో తన అత్త గారింట్లో ఉంటుంది. కుల్విందర్కు ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. కుల్విందర్ అత్త చరణ్జీత్ కౌర్తో మనవడు ఎక్కువగా గడుపుతుండడంతో ఆమెకు అసూయ పెరిగింది. తల్లితో పోలిస్తే నానమ్మపై మనవడికి ప్రేమ ఎక్కువగా ఉండడంతో తల్లికి అసూయ కలిగింది. కిచెన్లో ఉన్న చాకుతో తనయుడిని పలుమార్లు పొడిచి అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో బెడ్రూమ్లోకి నానమ్మ వెళ్లి చూడగా మనవడు రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే మనవడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు కోడలను కూడా నకోడర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. మనవడు అప్పటికే చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కంటే అత్తమ్మపై తనయుడి ప్రేమ ఎక్కువగా చూపెడుతుండడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని పోలీసులకు వివరించింది.
నానమ్మపై ప్రేమ…. తనయుడిని కత్తితో పొడిచి…. కోడలు ఆత్మహత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -