మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల కాంబినేషన్లో మూవీ గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లక ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అయినా త్రివిక్రమ్తో సినిమా చేయాలని ఆశిస్తున్నాడు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో త్రివిక్రమ్తో సినిమా చేయాలని ఉందని మెగాస్టార్ పేర్కొన్నాడు. అన్నట్లుగానే ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్కు చిరంజీవి ఓకే చెప్పాడట. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం చిరంజీవి, త్రివిక్రమ్ల కాంబో మూవీ వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఏడాది అయినా ఖచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్తో చేసేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాడు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం వెంటనే తారక్తో సినిమాను త్రివిక్రమ్ మొదలు పెట్టబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. కానీ చరణ్ కంటే ముందు చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేస్తాడని మెగా కాంపౌండ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్లో నటిస్తాడని తెలిసింది. సుజిత్ దర్శకత్వంలో ఈ రీమేక్లో నటించిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమాను చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోకు మెగా ఫ్యాన్స్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబో సినిమాను రాధాకృష్ణ, చరణ్లు కలిసి నిర్మించే అవకాశం ఉందని సమాచారం.