- Advertisement -
హైదరాబాద్: భువనగిరి ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. టిపిసిసి ఛీప్ ఎంపిక నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పదవిని ఆశిస్తున్నవారిలో ఒకరిగా ఉన్న కోమటిరెడ్డి ఈ పదవిని తనకు ఇవ్వాలని సోనియాను అడిగినట్టు సమాచారం. కాగా, ఈ పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ పెద్దలను కలిసే పనిలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతల అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు మాణిక్యం ఠాగూర్. దీంతో కొత్త టిపిసిసి అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
MP Komatireddy Venkat Reddy Meets Sonia Gandhi
- Advertisement -