- Advertisement -
సంభల్: ఉత్తర్ ప్రదేశ్ సంభల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాముణ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగ్రా – మొరదాబాద్ రహదారిపై ఆర్జీసి బస్సు- గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు.
8 killed in bus-gas tanker collision at Sambhal
- Advertisement -