- Advertisement -
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రోజుకు 50 వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలుచేయాలన్న ఆదేశాలు పాటించలేదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు హైకోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం పిటిషన్ దాఖాలు చేసింది. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తున్నామని తెలిపిన ప్రభుత్వం రోజుకు యాభై వేల పరీక్షలు చేయడం కష్టమని కోర్టుకు వివరించింది.
Supreme Court stay on Telangana High Court order
- Advertisement -