- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై చర్చించే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్రం నూతనంగా తెచ్చిన సాగు చట్టాల్లో మార్పులు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొత్త చట్టాల నుంచి పంజాబ్, హరియాణా, యుపి రాష్ట్రాలకు మినహాయింపులు, కనీస మద్దతు ధరను కొనసాగించేలా చట్టాల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసనలు దిగిన సంగతి తెలిసిందే.
PM Modi will hold Union Cabinet meeting this evening
- Advertisement -