- Advertisement -
అమరావతి: వైసిపి ఎంపి మోపిదేవి వెంకటరమణ, డిప్యూటి ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తమ కాన్వాయ్ లతో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ కొద్దిసేపట్లో విశాఖ చేరుకుంటారనగా, మోపిదేవి ప్రయాణిస్తున్న కారు తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఆగివున్న మరో కారును ఢీకొట్టింది. రోడ్డుపై స్టాప్ బోర్డులు అడ్డుగా ఉండడంతో మోపిదేవి వాహనం అదుపుతప్పినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మోపిదేవి వాహనం దెబ్బతినడంతో డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి కారును ఆపి మోపిదేవిని పరామర్శించి, తన కారులో ఎక్కించుకున్నారు. మోపిదేవికి ప్రమాదం తప్పడం పట్ల వైసిపి నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MP Mopidevi Venkata Ramana Car Road Accident
- Advertisement -