- Advertisement -
మెదక్ ఎంపి రఘునందన్రావుకు మరోమారు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. హైదరాబాద్లోనే ఉన్నామని సాయంత్రం లోగా చంపేస్తామని హెచ్చరించారు. రఘునందన్రావుకు ఇలా బెదిరింపు ఫోన్ కాల్ రావడం ఇది ఆరోసారి. తాజాగా ఆయనకు 9404348431 నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు.
- Advertisement -