Tuesday, April 30, 2024

సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గజానన్ మాల్యతో ఎంపి రంజిత్ భేటీ

- Advertisement -
- Advertisement -

సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్య తో భేటీ అయిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆ అరికెపూడి గాంధీ

లింగంపల్లి రైల్వే స్టేషన్ లో సుమారు అరగంట పాటు రైల్వే సమస్యలపై చర్చలు

MP Ranjith meets with South Central Railway GM Gajanan Mallya

హైదరాబాద్: లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తో స్థానిక చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నే శ్రీనివాస్ రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లాంజ్ లో సుమారు అరగంట పాటు చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల పలు రైల్వే సమస్యలపై చర్చించారు. రైల్వే సమస్యలు ప్రజల సమ్మతితో తీర్చాలని కోరారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, కార్పొరేటర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News